Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనాభా కారణంగానే భూగర్భ జలాల క్షీణత

Advertiesment
భూగర్భ జలాలు
ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాల క్షీణతపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాల ఆధారంగా ఓ నివేదిక తయారు చేశారు. ఇందులో భారత్‌లో భూగర్భ జలాల క్షీణతపై కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంగా ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు ఏడాదికి సుమారు అడుగు మేర క్షీణిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

జనభా కారణంగానే భూగర్భ జలాలు ఈ స్థాయిలో క్షీణిస్తున్నాయి. భారత్‌లో భూగర్భ జలాల క్షీణతకు మానవ వినియోగమే కారణమని నాసా నివేదిక తెలిపింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో 2002- 2008 మధ్య కాలంలో 26 క్యూబిక్ మైళ్ల భూగర్భ జలాలు అదృశ్యమయ్యాయి. ఈ నీటితో అమెరికాలోని అతిపెద్ద మానవ నిర్మిత మీడ్ సరస్సును మూడుసార్లు నింపవచ్చు. నాసా తయారు చేసిన ఈ పరిశోధన నివేదికను నేచర్ జర్నల్ ప్రచురించింది.

Share this Story:

Follow Webdunia telugu