Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జకార్తా బాంబర్లను గుర్తించిన టీవీ ఛానల్

Advertiesment
ఇండోనేషియా టీవీ ఛానల్
ఇండోనేషియా రాజధాని జకార్తాలో రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం జరిగిన బాంబు దాడుల్లో పాల్గొన్న ఓ అనుమానితుడిని ఆ దేశానికి చెందిన ఓ టీవీ ఛానల్ గుర్తించింది. మారియట్, రిడ్జ్- కార్ల్‌టన్ హోటళ్లపై జరిగిన బాంబు దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, 60 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ ఆత్మాహుతి దాడుల అనుమానితుడిని గుర్తించామని మెట్రో టీవీ ఛానల్ వెల్లడించింది. ఈ అనుమానితుడికి అతివాద ఇస్లామిక్ గ్రూపు జెమాహ్ ఇస్లామియా సభ్యులతో పాఠశాల సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇండోనేషియా పోలీసులు హోటళ్లపై జరిగిన దాడులకు జెమాహ్ ఇస్లామియా ప్రధాన సూత్రధారి అయివుండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఓ ఆత్మాహుతి దళ సభ్యుడిని పోలీసులు ఎన్‌గా గుర్తించారు. అతనికి సంబంధించిన వివరాలేమీ వెల్లడించలేదు. అయితే మెట్రో టీప్ (ప్రైవేట్ టీవీ ఛానల్) పోలీసులు గుర్తించిన అనుమానితుడిని నుర్హాస్బిగా పేర్కొంది. అతని కుటుంబసభ్యులు నుర్హాస్బి కనిపించడం లేదని, ఫోన్‌లోనూ అందుబాటులో లేడని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu