Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో స్వైన్ ఫ్లూ వ్యాప్తికి అడ్డుకట్ట

Advertiesment
అంతర్జాతీయం
File
FILE
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధిగా వణికిస్తున్న స్వైన్ ఫ్లూ ఎందరినో పొట్టన పెట్టుకుంది. దాదాపు అన్ని దేశాల్లోనూ స్వైన్ ఫ్లూ మరణాలు నమోదయ్యాయి. కానీ చైనాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క స్వైన్ ఫ్లూ మరణం కూడా లేదు.

ఎక్కువ మోతాదులో టీకా మందు ఇవ్వడం.. లేదా.. హెచ్1ఎన్1 వైరస్ నియంత్రించడం వంటివైతే మాత్రం కాదు. కఠిన నియమాలు, నిబంధనలు అమలు చేయడమే చైనా స్వైన్ ఫ్లూ వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. సామాన్యుని నుంచి ఎంత పెద్దరినైనా సరే.. స్వైన్ ఫ్లూ ఉందన్న అనుమామనం వస్తే.. వెంటనే వారిని పూర్తిగా పరీక్షించి.. పరీక్షల్లో పాజిటివ్ తేలితే.. ఆసుపత్రిలోని ఓ ప్రత్యేక గదిలో ఉంచుతారు.

ప్రత్యేకించి వైద్యులు తీసుకుంటున్న చొరవ అంతా ఇంతా కాదు. వారి కఠోర శ్రమ, సంకల్పం చైనాలో స్వైన్ ఫ్లూ వ్యాప్తిని దాదాపు అరికట్టాయి. ఇప్పటి వరకు చైనాలో 2,400 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్థారణైంది. కానీ వారిలో ఒక్కరూ మృతి చెందలేదంటే.. ఏ స్థాయిలో చర్యలు చేపట్టారో.. మనకు అవగతమవుతుంది.

ఆసుపత్రుల్లో మిగతా రోగులకు దూరంగా ఉంచుతూ.. స్వైన్ ఫ్లూ నిర్మూలన కోసం ఇచ్చే టీకా మందు తయారయ్యే వరకు ప్రత్యేక గదుల్లో ఉంచుతారు. విమానాశ్రయాల్లో సైతం.. వైద్యులు పూర్తిగా మాస్కులు ధరించి.. ప్రతి ఒక్కరినీ క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. హోదాను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

పూర్తి పరీక్షలు నిర్వహించిన తర్వాత విమానాశ్రయంలోంచి ప్రయాణీకులు దేశీయులు, విదేశీయులు చైనాలోకి అడుగుపెట్టాలి. బాగా పకడ్బంధీగా ఈ విధానాలను అమలు చేస్తుండటంతో ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ.. అధికారులెవ్వరూ వెనుకంజ వేయకపోవడం విశేషం.

దాదాపు 130 కోట్ల మంది ప్రజలు ఉన్న చైనాలో ఇంత భారీ ఎత్తున చర్యలు చేపడుతుండబట్టే.. స్వైన్ ఫ్లూకు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. కానీ భారత్‌లో ఇప్పటికే.. 24 మంది మృతి చెందారు. మృతి చెందిన వారు ఇది వరకే మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారని అధికారులు చెబుతున్నారు.

కానీ.. స్వైన్ ఫ్లూ వ్యాప్తిని మాత్రం అరకట్టలేకపోతున్నారు. ఇటీవల తాజాగా మరో రెండు రాష్ట్రాలకు స్వైన్ ఫ్లూ పాకడం అధికారుల వైఖరికి ఇది నిదర్శనం. మరోవైపు స్వైన్ ఫ్లూ రోగులకు ఆసుపత్రులలో కావలసినన్ని బెడ్ల సౌకర్యం లేదని వార్తలు వస్తున్నాయి. పరిస్థితి చేజారకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం మంచిదని ఆసుపత్రి వర్గాలు కొన్ని తెలుపుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu