Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వం అంత సులువు కాదు

Advertiesment
ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వం అంత సులువు కాదు
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారదేశం శాస్వత సభ్యత్వాన్ని సంపాధించడం అంత సులువు కాదని ఇద్దరు పాకిస్థాన్ ఫెడరల్ మంత్రులు వ్యాఖ్యానించారు. ఐరాసలో భారత్ శాస్వత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు ఇవ్వడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఐరాస భద్రతా మండలిలలో న్యూఢిల్లీ శాస్వత సభ్యత్వాన్ని పొందాలనే లక్ష్యం అంత సులువైనదని కాదని వారు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముక్తర్ మాట్లాడుతూ.. "అదంత సులువు కాదు" (ఐరాస భద్రతా మండలిలలో భారత శాస్వత సభ్యత్వం) అని అన్నారు. అంతేకాదు, భద్రతా మండలి విస్తరణ విషయంలో పాకిస్థాన్‌ను కూడా కలుపుకుని పోయినట్లయితే అది ఈ ప్రాంతంలో శాంతికి ఎంతో దోహదపడుతుందని కూడా ఆయన అన్నారు.

ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి సర్దార్ అసిఫ్ అహ్మద్ అలీ మాట్లాడుతూ.. భద్రతా మండలిలలో పర్మినెంట్ సీట్ కోసం భారత్‌ను అంతర్జాతీయ పరిస్థితులు అనుమతించబోవని అన్నారు. ఐరాస భద్రతా మండలిలో శాస్వత సభ్యత్వం పొందడం ఒబామా ప్రభుత్వాన్ని ఒప్పించినంత సులభం కాదని ఆయన రేడియో పాకిస్తాన్‌తో అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి చాలా దేశాలు పోటీ పడుతున్నాయని, అయితే అంతర్జాతీయ పరిస్థితి భారత్‌కు అనుకూలంగా లేదని కూడా ఆయన వాదించారు.

Share this Story:

Follow Webdunia telugu