Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాక్‌లో దాడులు, 34మంది మృతి

Advertiesment
ఇరాక్
FILE
ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని నగరం మోసుల్‌లో షియావర్గానికి చెందిన మసీదు బయట శుక్రవారం బాంబు దాడులు జరగడంతో అక్కడికక్కడే 30 మంది మృతి చెందగా దుండుగులు మరో నలుగురిపై కాల్పులు జరిపి చంపేశారు.

మోసుల్ ప్రాంతంలో బాంబు దాడులు జరిగి మొత్తం 34 మంది మృతి చెందగా దాదాపు 72 మంది తీవ్రగాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. షియా వర్గంపై తరచూ జరిగే దాడులలో ఇది తాజా సంఘటన అని వారు తెలిపారు.

శుక్రవారం జరిగిన ఈ సంఘటన వలన రానున్న రోజులలో ఇరువర్గాల మధ్య మళ్ళీ దాడులు పునరావృత్తం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా 2006 మరియు 2007లో ఇలాంటి దాడులు జరిగాయని ఓ పోలీసు ఉన్నతాధికారి గుర్తు చేశారు. తీవ్రగాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు చేరవేసినట్లు ఆయన వివరించారు.

కాగా ప్రత్యర్థులు శుక్రవారం జరిపిన దాడులలో షియా వర్గానికి చెందిన మసీదుని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారని ఇందులో తుర్కీలు అల్పసంఖ్యాక వర్గమని పోలీసు అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu