Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి ఇరవై మంది మృతి

Advertiesment
ఇరాక్
ఇరాక్‌లో మరోసారి బాంబు పేలుళ్ళు జరిగాయి. ఉత్తర ఇరాక్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 20మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

ఇరాక్‌లోని మోసుల్‌ రాష్ట్రం తాల్‌ అఫర్‌, సదర్‌ సిటీల్లోని రద్దీ ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆత్మాహుతి దళాలకు చెందిన ఇరువురు అక్కడికక్కడే తమను తాము పేల్చేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనల్లో దాదాపు 60మందికి పైగా తీవ్రగాయాలపాలైనారని వీరిని తక్షణమే వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని అధికారులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu