Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్ఘనిస్థాన్‌లో బ్యాంకుపై దాడి: ముగ్గురు హతం

Advertiesment
భద్రతా సిబ్బంది
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లోని ఓ బ్యాంకులోకి ముగ్గురు తాలిబాన్ తీవ్రవాదులు బుధవారం చొరబడ్డారు. వీరిని భద్రతా సిబ్బంది చుట్టముట్టి హతమార్చారు. ముగ్గురు తీవ్రవాదులు సెంట్రల్ కాబూల్‌లోని ఓ బ్యాంకు భవనంలోకి చొరబడ్డారు. వీరిని భద్రతా సిబ్బంది ఆపరేషన్‌లో హతమార్చారని పోలీసులు వెల్లడించారు.

బ్యాంకుపై దాడిలో పాల్గొన్న తీవ్రవాదులు తాలిబాన్లేనని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. తాలిబాన్లు కూడా బ్యాంకుపై దాడి యత్నం తమదేనని ధృవీకరించారు. దేశంలో గురువారం చారిత్రాత్మక అధ్యక్ష, ప్రావీన్స్ మండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తాలిబాన్ తీవ్రవాదులు దాడులు ముమ్మరం చేయడం భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

దేశ రాజధానిలోనే గడిచిన కొన్ని గంటల్లో పలుమార్లు తాలిబాన్ తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. అత్యంత భద్రత ఉంటే రాజధాని నగరంలో రాకెట్ దాడులు, ఆత్మాహుతి దాడులు జరుగుతుండటంతో ఎన్నికల భద్రతపై పౌరుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఎన్నికలు నాటో దళాల పర్యవేక్షణలో శాంతియుతంగా నిర్వహించగలమని అధికారిక యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu