మధ్య ఆఫ్గనిస్థాన్లో దుండగులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమంది సాధారణ పౌరులతోపాటు నలుగురు పోలీసులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
లోగర్ప్రావిన్స్లోని ఓ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి ముస్తఫా ఖాన్ తెలిపారు.
ఈ సంఘటన గురువారం ఉదయం జరిగిందని ఇందులో పదిమంది పౌరులతోపాటు నలుగురు పోలీసులున్నట్లు ఆయన వివరించారు.
ఇదిలావుండగా ఆఫ్గనిస్థాన్లోని దక్షిణ హేల్మంద్ ప్రాంతంలో అమెరికాకు చెందిన సైనికుల బృందం ఉందని, వారికి తన సత్తా ఏంటో చూపేందుకే తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడి ఉంటారని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.