Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆప్ఘన్‌లోని బ్రిటీష్ కౌన్సిల్‌పై తాలిబన్ల దాడి: 9 మంది మృతి!

ఆప్ఘన్‌లోని బ్రిటీష్ కౌన్సిల్‌పై తాలిబన్ల దాడి: 9 మంది మృతి!
ఆప్ఘనిస్థాన్‌ దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న బ్రిటీష్ కౌన్సిల్ కార్యాలయంపై తీవ్రవాదులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పది మంది గాయపడ్డారు. ఈ కార్యాలయం గేటుకు ముందు ఆత్మాహుతి దళసభ్యుడొకరు కారులో వచ్చి తనను తాను పేల్చుకున్నాడు.

అనంతరం మరో కారులో నలుగురు తీవ్రవాదులు వేగంగా కౌన్సిల్ లోపలికి దూసుకుపోయారు. అడ్డుకున్న సిబ్బందిపై, కంటబడిన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు.

కాగా మృతుల్లో తొమ్మిది మంది ఆప్ఘన్ జాతీయులు, మరొకరు వీదేశీ సైనికుడు ఉన్నారని ఆప్ఘనిస్థాన్ నేర పరిశోధనా విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడులపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా మాట్లాడుతూ.. ఈ దాడితో తాము ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి, బ్రిటన్‌కు హెచ్చరిక చేస్తున్నట్టు చెప్పారు. తమకు విదేశీయుల నుంచి ప్రత్యేకించి బ్రిటన్ నుంచి మరోసారి స్వాతంత్య్రం రావాల్సి ఉందని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu