Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా సబ్‌వే ప్రమాదం: ఆరుగురి మృతి

Advertiesment
అమెరికా సబ్వే ప్రమాదం
అమెరికాలో సోమవారం రెండు సబ్‌వే మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 70 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్- మేరీలాండ్ రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలోని రైల్వే మార్గంపై సోమవారం అంతర్జాతీయ కాలమానం ప్రకారం 2100 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

రెండు స్టేషన్ల మధ్య నిలిచిపోయిన రైలును వెనుక వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మృతి చెందినవారిలో వెనుక నుంచి రైలును ఢీకొట్టిన రెండో రైలు డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రమాదంలో రెండో రైలు డ్రైవర్ కంపార్ట్‌మెంట్ పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంది. గాయపడిన 70 మందిలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అధికారిక వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.

Share this Story:

Follow Webdunia telugu