కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... ఒకటిన్నర కప్పు
సోయాపిండి... రెండు టీస్పూన్లు
పరాటాలో పెట్టే మిశ్రమంకోసం కాటేజ్ చీజ్... 150 గ్రా.(తురిమినది)
సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ... ఐదు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు... ఒకటి
గరంమసాలా... చిటికెడు
నూనె... రెండు టీస్పూన్లు
తయారీ విధానం :
గోధుమపిండినీ, సోయాపిండినీ నీళ్ళతో చపాతీపిండిలా కలపాలి. ఒక పాత్రలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర, చీజ్, ఉప్పు, గరంమసాలాలను తీసుకుని బాగా కలపి ఉంచుకోవాలి.
ఇప్పుడు నిమ్మకాయంత సైజు పిండిని తీసుకుని.. అందులో పైన కలిపి ఉంచుకున్న ఉల్లిముక్కల మిశ్రమాన్ని అందులో పెట్టి, పరాటాల్లాగా చేసుకోవాలి. పెనం వేడిచేసి కొద్దిగా నూనె వేసి పరాటాను రెండువైపులా బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీసేయాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడే రైతా (పెరుగుపచ్చడి)తో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.