కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం - మూడు కప్పులు, వెదురు చిగురు - మూడు చిన్నవి, పచ్చి బఠాణీలు - కప్పు, షాలట్లు - ఏడు, బెంగళూరు పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయలు - మూడు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, చిల్లీ సాస్ - ఒకటిన్నర చెంచా, టమోటా సాస్ - రెండు చెంచాలు, బంగాళదుంప - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - పావు కప్పు.
తయారు చేయు విధానం :
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెదురు చిగురు, బెంగళూరు మిర్చిలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగిన తర్వాత దానిలో ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. షాలట్లు, వెల్లుల్లి రెబ్బలను వేసి వేగాక, మిగిలిన కూరలన్నిటినీ వేసి సాస్లు కూడా వేసి వేయించాలి.
మరోవైపు ఇంకో గిన్నెలో నూనె వేసి కాగాక, బియ్యాన్ని వేసి వేయించాలి. కాసేపు వేగాక కాసిని నీళ్లు పోసి వాటిని ఉడకబెట్టాలి. అది ఉడికిన తర్వాత అందులో బాణాలిలో వేయించిన వాటిని కూడా వేసి బాగా కలపాలి. అనంతరం దీనిపై తరిగిన కొత్తిమీరను అలంకరించి సర్వ్ చేయాలి.