కావలసిన పదార్థాలు :
అన్నం... రెండు కప్పులు
అల్లం, పచ్చిమిర్చి... సన్నగా తరిగినవి తగినంత
గోధుమపిండి
ఉప్పు... సరిపడా
నూనె లేదా నెయ్యి... సరిపడా
తయారీ విధానం :
అన్నం, అల్లం పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, గోధుమపిండిలను మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పరాఠాల్లాగా ఒత్తుకోవాలి.
స్టవ్పై పెనం పెట్టి బాగా కాలిన తరువాత నూనె లేదా నెయ్యి వేసి ఒత్తుకున్న పరాఠాలను రెండువైపులా బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చాలి. అంతే రైస్ పరాఠాలు సిద్ధమైనట్లే...! వీటిని పల్లీల పచ్చడి లేదా గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.