Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుచికరమైన బియ్యంపిండి పాయసం తయారీ

Advertiesment
రుచికర బియ్యంపిండి పాయసం తయారీ
సేమియాతో పాయసం తయారు చేయడం అందరికీ తెలిసిందే. అయితే బియ్యం పిండితో పాయసాన్ని తయారు చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రుచికరమైన బియ్యంపిండి పాయసం తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.

బియ్యంపిండి పాయసం తయారీకి కావాల్సినవి : బియ్యం- పావు కప్పు, చక్కెర- 100- 150 గ్రాములు, పాలు-రెండున్నర కప్పు, యాలకులు- రెండు, ఎండుద్రాక్ష- 30 గ్రాములు, కుంకుమపువ్వు- కొంచెం.

పాయసం తయారు చేయు విధానం : తడిబియ్యాన్ని ఆరబెట్టి తర్వాత సన్నటి నూకగా ఉండేలా దంచుకోవాలి. తర్వాత పాలు తీసుకుని పాత్రలో పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బియ్యపు పొడిని, యాలకుల పొడిని వేసి బాగా మరగనివ్వాలి. అయితే పాయసం అడుగు మాడకుండా దాన్ని మధ్య, మధ్యలో కలియబెడుతుండాలి.

పాయసం బాగా చిక్కగా వచ్చాక పొయ్యి నుంచి దించేయాలి. కాసేపు తర్వాత కుంకుమపువ్వు చల్లి మళ్లీ పొయ్యిపై పెట్టాలి. ఇప్పుడు చక్కెర కూడా కలిపి కాసేపు సన్నని మంటపై ఉండనిచ్చి దించేయాలి. ఇలా తయారు చేసిన బియ్యం పాయసాన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే తినడం ప్రారంభిస్తే చాలా రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu