కావలసిన పదార్థాలు :
మెతికూర - రెండు కట్టలు, ఎండుమిర్చి - ఐదు, పచ్చిమిర్చి - ఐదు, చింతపండు - కాస్త, వెల్లుల్లి - ఐదు రెబ్బలు, మినపప్పు - చెంచా, ఆవాలు - చెంచా, మెంతులు - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - ఆరు చెంచాలు, ఇంగువ - చిటికెడు.
తయారు చేయు విధానం :
ముందుగా చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. మెంతి కూరను కాడలు తీసి శుభ్రంగా కడిగి మెత్తగా వేయించి పెట్టుకోవాలి. మూడు చెంచాల నూనెను బాణాలిలో వేసి కాగాక, అందులో ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువలను వేయించాలి. ఆ తర్వాత మెంతికూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేయించిన సామగ్రిని మిక్సీలో వేసి మెత్తగా నూరాలి. దీనిపై నూనెతో పోపు పెట్టాలి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.