భారతదేశంలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు ఆరోజు మనం భుజించే ఆహార పదార్థాలు సైతం ప్రత్యేకమైనవిగానే ఉంటాయి. మన తెలుగునాట అరిసెలు...కజ్జికాయలు వంటి అనేక రుచికరమైన ఆహారపదార్థాలను తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన వాటిని బంధువులకు సైతం రుచి చూపించటం ఆనవాయితీ. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో భారతదేశంలోని ఆయా రాష్ట్రాలలో నివశించే ప్రజలు బదిలీలపైనో... లేదంటే తమ చదువు తగ్గ ఉద్యోగం మరో రాష్ట్రంలో లభ్యమవటం వల్లనో వలస పోవలసి వస్తుంది.
ఉదాహరణకు మహారాష్ట్రలో పుట్టిపెరిగి ఉద్యోగ రీత్యా మన రాష్ట్రంలో స్థిరపడినవారికి వారి పండుగ సందర్భంగా తయారుచేసుకునే భోజన పదార్థాలు దొరకటం కష్టమే కదా.. ఈ నేపధ్యంలో రాష్ట్రరాజధానిలోని పలు పెద్ద హోటళ్లు ఆ లోటు తెలియకుండా చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలవారి సంప్రదాయ వంటకాలను తయారు చేసి, పండుగనాడు మా సంప్రదాయ వంటకాన్ని రుచిచూడలేకపోయామే అన్న భావననుంచి పూర్తిగా బయటవేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాదులోని తాజ్ కృష్ణ మహరాష్ట్రీయుల కొత్త సంవత్సరం గుడి పడ్వా సందర్భంగా వివిధ వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను వీక్షించండి.