కావలసిన పదార్థాలు :
అటుకులు... అరకేజీ
నూనె... పెద్ద సైజు గరిటెడు
ఉప్పు... తగినంత
మసాలా పొడి... రెండు టీ.
కరివేపాకు... నాలుగు రెబ్బలు
వేరుశెనగపప్పు... వంద గ్రా.
శనగపప్పు... వంద గ్రా.
తయారీ విధానం :
స్టవ్పై బాణలి పెట్టి కాసేపు వేడి చేసిన తరువాత... వేరుశెనగపప్పు వేసి వేయించాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి వేయించాలి. తరువాత అటుకులు వేసి ఎర్రగా అయ్యేదాకా వేయించి, ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించిన వేరుశెనగపప్పు, కరివేపాకు.. తగినంత ఉప్పు, మసాలా పొడి చల్లాలి.
అవసరం అనుకుంటే వీటిపై కొత్తిమీరను సన్నగా తరిగి చల్లుకోవచ్చు. అంతే మసాలా కారం అటుకులు సిద్ధమైనట్లే...! ఇవి సాయంత్రంపూట తినేందుకు చాలా బాగుంటాయి. మసాలాలను ఇష్టపడే చిన్నారులు, పెద్దవారు వీటిని ఇష్టంగా తింటారు. మరి మీరూ...!!