మసాల సువాసనతో "బేసన్ బాల్స్"
కావలసిన పదార్థాలు : శెనగపిండి... 150 గ్రా.నువ్వులు... 50 గ్రా.నూనె... వంద గ్రా.నీరు... ఒకటిన్నర గ్లాసుఉప్పు.. తగినంతకొత్తిమీర తురుము.. కాస్తంతఉల్లిముద్ద... పావు కప్పుటొమోటో గుజ్జు... అర కప్పుకొబ్బరి గసాల ముద్ద.. రెండు టీ.కార్న్ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి... తలా ఒక టీ.కారం, ధనియాల పొడి.. చెరో టీ.పసుపు, గరంమసాలా... చెరో పావు టీ.తయారీ విధానం : శెనగపిండిలో నువ్వులపొడి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, నూనె, కొంచెం నీళ్లు అన్నీ కలిపి గట్టిముద్దలా కలపాలి. ముద్దలోంచి కొద్దికొద్దిగా తీసుకుని గోళీకాయల సైజులో ఉండలు చేసి 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేసి కలపాలి. టొమాటో గుజ్జు, కొబ్బరి-గసాల ముద్ద వేసి కలియబెట్టి, ఎసరునీళ్లు పోసి మూత ఉంచాలి. నీళ్లు సగం ఇగిరాక శెనగపిండి ఉండలు వేసి ఉడికించాలి. నూనె పైకి తేలేదాకా ఉడికించి కొత్తిమీర చల్లి దించేయాలి. మసాలా సువాసనతో కమ్మగా ఉండే ఈ బేసన్ బాల్స్ను వేడిగా ఉన్నప్పుడే తినాలి. అన్నం, చపాతీల్లోకీ కూడా ఇవి చాలా బాగుంటాయి.