కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... ఒక కప్పు
బియ్యంపిండి... పావుకప్పు
నూనె... తగినంత
ఉప్పు... సరిపడా
పచ్చిబఠాణీలు... అర కప్పు
తయారీ విధానం :
గోధుమపిండి,బియ్యంపిండి, ఉప్పు కలిపి చిక్కగా దోసెల పిండిలాగా కలుపుకుని ఓ అరగంటపాటు ఊరబెట్టాలి. ఈలోపు పచ్చిబఠాణీలను ఉడికించి ఉంచాలి. ఇప్పుడు పాన్ను వేడి చేసి కలిపి ఉంచుకున్న పిండిని ఊతప్పంలాగా మందంగా వేయాలి. దాని పైన ఉడికించిన బఠాణీలను వేయాలి. నూనె వేస్తూ.. జాగ్రత్తగా రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి బఠానీలతో తయారైన ఊతప్పం సిద్ధమైనట్లే...! దీన్ని అలాగే లేదా టొమోటో చట్నీలతో కలిపి తినవచ్చు.