కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం... ఒక కప్పు
ఉల్లిపాయ... ఒకటి
పచ్చిమిర్చి... రెండు
అల్లం... చిన్న ముక్క
నూనె... రెండు టీ.
టొమోటో... ఒకటి
పచ్చి బఠాణీలు... పావు కప్పు
పెసర మొలకలు... పావు కప్పు
ముల్లంగి తురుము... రెండు టీ.
ఉప్పు... తగినంత
కొత్తిమీర తురుము... రెండు టీ.
తయారీ విధానం :
బాస్మతి బియ్యాన్ని బాణలిలో వేసి 3 నిమిషాలు వేయించాలి. తరువాత వాటిని కడిగి చల్లని నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టి, ఆపై వంపేయాలి. బియ్యంలో కప్పున్నర నీళ్లు పోసి గిన్నె కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టకుండా 20 నిమిషాలు ఉడికించాలి. అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నని ముక్కలుగా తరిగి, మెత్తగా రుబ్బి ఉంచాలి.
బాణలిలో నూనె పోసి ఉల్లిముద్ద, టొమాటో ముక్కలు వేసి పది నిమిషాలు వేగాక పచ్చిబఠాణీలు వేసి అవి మెత్తబడేవరకూ ఉడికించాలి. తరువాత పెసర మొలకలు, ముల్లంగి తురుము వేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. ఉప్పు సరిచూసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఉడికించిన బాస్మతి బియ్యంలో కలపాలి. కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా తింటే బాగుంటుంది.