కావలసినవి :
పెసరపప్పు-100 గ్రాములు
పంచదార -125 గ్రాములు
పాలు -1 లీటరు
నెయ్యి -1 చెంచా
కిస్మిస్ -1 చెంచా
జాజికాయ పొడి -అర చెంచా
తయారీ విధానం :
పొయ్యి మీద బాండీ పెట్టి పెసరపప్పు వేసి సన్నని మంటమీద గరిటతో కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. పప్పు ఏ మాత్రం మాడకుండా చూసుకోవాలి. ఈ పప్పుకి అర లీటరు పాలు కలిపి కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఈ లోపల పాలు గిన్నెలో పోసి కాగనిచ్చి పంచదార కలిపినప్పుడే కిస్మిస్ కూడా వేసి ఉడికించాలి. కుక్కర్లోంచి పప్పు తీసి పాలతో పప్పును బాగా మెదిపి కలపాలి. ఈ మిశ్రమానికి చిక్కగా ఉడికించిన పాల మిశ్రమం కలిపి గిన్నెలోకి తీసి జాజికాయ పొడివేసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా వడ్డించాలి.