పుదీనా ఘుమఘమలతో "బగారా మింట్ రైస్"
కావలసిన పదార్థాలు :బియ్యం.. ఒక కేజీఉల్లిపాయలు.. 2నూనె లేదా నెయ్యి.. 5 టీ.అల్లం వెల్లుల్లి పేస్ట్.. 1 టీ.పచ్చిమిరపకాయలు.. 5కొత్తిమీర.. ఒక కట్టపుదీనా.. 2 కట్టలుపెరుగు.. 1 కప్పుబిర్యానీ ఆకులు.. 2యాలకులు.. 2లవంగాలు.. 2తయారీ విధానం :వెడల్పాటి గిన్నెలో నూనె వేడిచేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, లవంగాలు, ఏలకులు, ఉల్లిపాయ తరుగు కలిపి వేయించాలి. ఆ తరువాత పెరుగు కలిపి, రెండు లీటర్ల నీటిని పోసి... మరుగుతుండగా ముందుగా నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని అందులో పోయాలి. బియ్యం బాగా ఉడికిన తరువాత దించబోయేముందు కొత్తిమీర దానికి కలిపి దించేయాలి. అంతే బగారా మింట్ రైస్ సిద్ధం..!