కావలసిన పదార్థాలు :
బఠాణీలు... అర కేజీ
పనీర్... అర కేజీ
ఉల్లిపాయలు... అర కేజీ
టొమాటో... అరకేజీ
కొత్తిమీర... రెండు కట్టలు
పసుపు... రెండు టీ.
కారం... రెండు టీ.
గరంమసాలా... నాలుగు టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద... నాలుగు టీ.
ఉప్పు... తగినంత
నూనె... సరిపడా
తయారీ విధానం :
పనీర్ను ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె పోసి కాగాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాస్త వేగాక, ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరవాత అరకప్పు నీళ్లు పోయాలి.
నీళ్లన్నీ ఆవిరైపోయాక బఠాణీలు వేసి అవి మునిగేవరకూ మళ్లీ నీళ్లుపోసి కారం కూడా కలిపి, మూతపెట్టి బఠాణీ మెత్తబడేవరకూ ఉడికించాలి. తరవాత పనీర్ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా గరంమసాలా చల్లి దించితే పనీర్ బఠాణీ మసాలా కుర్మా రెడీ అయినట్లే...!!