కావలసిన పదార్థాలు :
పచ్చిమిరపకాయలు... 350 గ్రాములు
మినపప్పు... 50 గ్రాములు
ఆవాలు... 2 టీ స్పూన్లు
ఇంగువ... కొంచెం ఎక్కువగానే
ఉప్పు... తగినంత
బెల్లం... ఒక వుండ
చింతపండు... బత్తాయిపండు అంత
నువ్వులనూనె... ఒక చిన్న టీ కప్పు
తయారీ విధానం :
మొదటగా బాణలిలో పావు టీ స్పూను నూనె వేసి వేడయ్యాక ఇంగువ వేసి, మినపప్పు వేయించాలి. పచ్చిమిరపకాయలను మరో 2 స్పూనుల నూనె వేసి వేయించాలి. ఇలా వేయిస్తున్నప్పుడు మిరపకాయ వేగకుండా, చిట్లకుండా చూసుకోవాలి. అంటే మిరపకాయలో నీరు మాత్రం పోయేలా వేయించాలి.
తరువాత చింతపండు, ఉప్పు రుబ్బుకోవాలి. ఇంగువ, వేగిన పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా రుబ్బుకోవాలి. వేయించిన మినపప్పు కూడా అందులో కలిపి రుబ్బాలి. మిగిలిన నూనె వేడి చేసుకొని ఆవాలు పోపు వేయాలి. పొయ్యి ఆర్పేసి నూరిన ముద్ద కూడా ఆ పోపులో వేసేస్తే పచ్చిమిరపలో వుండే మిగిలిన నీరు కూడా ఇంకి పోతుంది. అంతే పచ్చిమిరపకాయల తొక్కు సిద్ధమైనట్లే...!