కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... ఒక కేజీ
నూనె... తగినంత
పెరుగు... ఒకటిన్నర కప్పు
నీళ్లు... తగినన్ని
మైదా... రెండు టీ.
కార్న్ఫ్లోర్... ఆరు టీ.
కరివేపాకు... ఒక కప్పు
కొత్తిమీర తురుము... రెండు టీ.
అల్లంవెల్లుల్లి తురుము... రెండు టీ.
కారం... రెండు టీ.
మిరియాలపొడి... రెండు టీ.
పచ్చిమిర్చి... పదిహేను
ఉప్పు... తగినంత
ఫుడ్ కలర్... కొద్దిగా
తయారీ విధానం :
బంగాళాదుంపలను ఉడికించి తొక్కతీసి ముక్కలుగా కోయాలి. ఓ గిన్నెలో కార్న్ఫ్లోర్, మైదా, కారం, మిరియాలపొడి, ఉప్పు, ఫుడ్కలర్, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గుజ్జులా కలపాలి. ఇందులో బంగాళాదుంప ముక్కలు ముంచి తీయాలి. పది నిమిషాల తరవాత నూనెలో పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి.
విడిగా ఓ కళాయి తీసుకుని నూనె పోసి కాగాక.. కరివేపాకు, పచ్చిమిర్చి కలిపి వేయింటి, ఆ తరువాత ఆలూ ముక్కలు కూడా వేసి సన్నని మంటపై ఉడికించాలి. కొద్దిగా నీళ్లు చల్లి వేగిన తరువాత కొద్దిగా కారం, కొత్తిమీర చల్లి దించేయాలి. దీనిని స్నాక్స్లాగానూ, రొట్టెల్లోనూ కలిపి తినవచ్చు.