పంజాబీ పసందు.. "చిక్ బఠాణి"తో విందు..!!
కావలసిన పదార్థాలు :ఎండు బఠాణీలు... పావు కేజీకొత్తిమీర... ఒక కట్టఅమ్చూర్... ముప్పావు టీ.జీలకర్ర.. అర టీ.పసుపు.. అర టీ.ఛాట్ మసాలా.. అర టీ.మిరియాలు... ముప్పావు టీ.కరిగించిన నెయ్యి... పావు కప్పుపచ్చిమిర్చి.. నాలుగుఅల్లం ముద్ద... ఒక టీ.పుదీనా... రెండు టీ.ఉప్పు... సరిపడాతయారీ విధానం :బఠాణీలను రాత్రిపూటే నానబెట్టాలి. మందపాటి పాన్లో వీటిని వేసి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. అవి ఉడికిన తరువాత నీళ్లు వంపేయాలి. మిరియాలు పొడి కొట్టాలి. అందులోనే మిగిలిన మసాలాలన్నీ కలిపి, ఉడికించి ఉంచిన బఠాణీల్లో కలపాలి. నెయ్యి వేడిచేసి సగభాగం బఠాణీలమీద పోయాలి.పచ్చిమిర్చి ముద్దలా నూరుకోవాలి. ఇందులోనే అల్లం, కొత్తిమీర, పుదీనా తురుముల్ని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా బఠాణీల్లో వేసి కలపాలి. మిగిలిన నెయ్యి కూడా పోసి బాగా కలపాలి. ఉప్పు సరిచూసి వేడివేడిగా వడ్డిస్తే బాగుంటుంది. పంజాబీలు ఎక్కువగా చేసుకునే ఈ చోళీ కూరను చపాతీ, పూరీ, బ్రెడ్ ఎందులోకయినా తినవచ్చు.