తమిళుల స్పెషల్ డిష్ "ఆప్పం"
కావలసిన పదార్థాలు :బియ్యం.. అర కేజీఈస్ట్.. అర టీ.నూనె.. 50 గ్రా.ఉప్పు.. తగినంతతయారీ విధానం :బియ్యాన్ని మూడు గంటలసేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు విడిగా ఓ పాత్రలో రెండు గ్లాసుల నీటిని పోసి మరిగించాలి. ఈ నీటిని ఓ కప్పు బియ్యం పిండిలో కలిపితే చిక్కటి గంజిలాగా అవుతుంది. ఈ గంజిని మొత్తం బియ్యంపిండిలో కలిపి.. ఈస్ట్ కూడా వేసి బాగా కలిపి నాలుగు గంటలసేపు అలాగే ఉంచితే పిండి బాగా పొంగుతుంది. ఈ పిండిలో తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి.తరువాత ఒక నాన్స్టిక్ పెనం తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడయ్యాక రెండు గరిటెల పిండిని పెనం మధ్యలో వేయాలి. దాన్ని గరిటెతో పామకుండా పెనాన్ని కదుపుతూ దోసెలాగా చేయాలి. ఆపై చుట్టూ నూనె వేసి మూతపెట్టాలి. కాసేపటి తరువాత కాలిన ఆప్పంను రెండోవైపుకు తిప్పకుండా జాగ్రత్తగా అట్లకాడతో తీసి సర్వింగ్ ప్లేట్లలో సర్ది.. ఏదేని చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఆప్పం తయార్..!