గొడుగులతో పసందు.. "గోంగూర మష్రూమ్"
కావలసిన పదార్థాలు :పుట్టగొడుగులు.. 200 గ్రా.ఉల్లిపాయలు.. మూడుఅల్లం వెల్లుల్లి ముద్ద.. ఒక టీ.కారం.. ఒకటిన్నర టీ.పచ్చిమిర్చి.. ఆరుపసుపు.. పావు టీ.కొత్తిమీర.. 2 కట్టలునూనె.. 50 గ్రా.గోంగూర.. 10 కట్టలు (చిన్నవి)తయారీ విధానం :పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, ఉడికించి పక్కన ఉంచాలి. గోంగూరను శుభ్రంగా కడిగి ఓ గ్లాసు నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. తరువాత ఈ ఆకుల్ని మెత్తగా మెదపాలి. ఓ గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలపాలి. ఆపై ఉడికించిన పుట్టగొడుగు ముక్కలను, గోంగూర, కొత్తిమీర, మిశ్రమాలను వేసి... తగినంత ఉప్పు కలిపి ఓ ఐదు నిమిషాలపాటు ఉడికించి దించేయాలి. అంతే గోంగూర మష్రూమ్ తయార్..!!