కావలసిన పదార్థాలు :
రాజపురిరకం పచ్చిమామిడి కాయలు... ఒక కేజీ
మెంతులు... ఒక కప్పు
ఉప్పు... ఒకటిన్నర కప్పు
కాశ్మీరీ కారం... ఒకటిన్నర కప్పులు
ఆవపిండి... రెండు టీ.
ఇంగువ... రెండు టీ.
నువ్వుల నూనె... సరిపడా
తయారీ విధానం :
మామిడికాయల్ని కడిగి ఆరనివ్వాలి. తరువాత అంగుళం సైజు ఆవకాయముక్కల మాదిరిగా కోయాలి. వీటిని కాసేపు ఎండనివ్వాలి. ఒక కప్పు నువ్వుల నూనెను మరిగించాలి. అందులో మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ వేసి, బాగా కలిపి, ఓ పెద్ద స్టీలు గిన్నెలోకి మార్చాలి.
ఇప్పుడు పై మిశ్రమంలో ఆవకాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. చివరగా ఓ పలుచని బట్టతో దీని మూతిని బిగించి కట్టాలి. రెండు రోజుల తరువాత మరో రెండు కప్పుల నువ్వుల నూనెను వేయాలి. ఆపై దాన్ని జాడీలోకి మార్చుకోవాలి. పచ్చడిమీద నూనె అంగుళం ఎత్తున తేలుతూ ఉండేలా చూసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.