Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోల్పోయిన శక్తి తిరిగి పొందాలా...?

అయితే సగ్గుబియ్యం జావ తాగేస్తే పోలా...!!

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
నానబెట్టిన సగ్గుబియ్యం... ఒక కప్పు
నీరు... ముప్పావు లీటర్
చిక్కటి మజ్జిగ... ఒక గ్లాసు
కార్న్‌ఫ్లోర్... ఒక టీ.
బార్లీ గింజల పొడి... ఒక టీ.
మిరియాలపొడి... చిటికెడు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
కార్న్‌ఫ్లోర్‌లో బార్లీగింజల పొడి, మిరియాల పొడి కలిపి తగినన్ని నీళ్లు పోసి కాస్త జారుగా కలిపి ఉంచాలి. ఓ పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి మరిగించి సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం వేసి బాగా కలిపి సన్నటి సెగమీద గుజ్జుగా ఉడికించి గిన్నె దించాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే అందులో మజ్జిగ పోసి కలిపి ఉప్పు వేసుకొని తాగితే మంచిది. వడదెబ్బ తగిలిన వారికీ, నీళ్ల విరేచనాలు అయినవారికీ, ఎవరయినా సరే ఈ జావ తాగినట్లయితే కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu