కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టే "మిల్క్ రాడిష్ కర్రీ"
కావలసిన పదార్థాలు :ముల్లంగి... రెండుఉల్లిపాయలు... రెండుపచ్చిమిర్చి... రెండుఉప్పు... సరిపడాపసుపు... చిటికెడుకారం... సరిపడామసాలాపొడి... అర టీ.అల్లం, వెల్లుల్లి ముద్ద... ఒక టీ.పాలు... ఒక కప్పునూనె... సరిపడాతయారీ విధానం :ముల్లంగి దుంపలను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చిని కూడా తరిగి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి, మరిగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేయించి అందులోనే అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఆపై ముల్లంగి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సన్నటి సెగపైన మూతపెట్టి ఉడికించాలి. కారం, మసాలా పొడులను వేసి కలియబెట్టి కొంచెం సేపు ఉడికిన తరువాత, చివర్లో పాలు పోసి ఉడికించి చిక్కబడ్డాక దించేయాలి. ముల్లంగిలో ఆస్కోర్బిక్ ఆసిడ్, పోలిక్ యాసిడ్లు పుష్కళంగా ఉన్నాయి. వీటిద్వారా శరీరానికి విటమిన్ బి6, రిబోప్లావిన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం తదితరాలు అందుతాయి. ముల్లంగి తినటంవల్ల... దగ్గు, క్యాన్సర్, లివర్ సమస్యలు, గాల్బ్లాడర్ సమస్యలు, కిడ్నీలో రాళ్లు తదితర సమస్యల నుంచి బయటపడవచ్చు.