కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అర కిలో
మెంతికూర... 50గ్రా.
పాలకూర... 100గ్రా.
కొత్తిమీర... 3 కట్టలు
పచ్చిమిర్చి... 4
పసుపు... పావుటీస్పూను
ఉప్పు... తగినంత
నూనె... 50గ్రా.
తయారీ విధానం :
గోధుమపిండికి కొంచెం ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, ఆకుకూరలు, పసుపు కలిపి 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు పిండిలో మరికాస్త నీరు చల్లి ముద్దలా చేసి ఉంచాలి. పిండిముద్దను చిన్న సైజు బంతుల్లా గుండ్రంగా చేసుకోవాలి. ఒక్కోదాన్నీ మందంగా పొడవుగా ఒత్తి పెనంమీద వేసి రెండు టీస్పూన్ల నూనె వేసి రెండువైపులా దోరగా కాల్చాలి.
జట్టు రాలిపోయిందని బాధపడేకంటే ఎంచక్కా ఈ హరియాలీ రోటీని చేసుకుని తినేస్తారుగా మరి..! ఎందుకంటే ఇందులో వాడే మెంతి ఆకులు జట్టు రాలడాన్ని అరికట్టి, ఒత్తుగా పెరిగేటట్లు చేయటమేగాక, చుండ్రును కూడా అరికడుతుంది. పాలకూర వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం కూడా అందుతుంది.