కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న పిండి... రెండు కప్పులు
గోధుమపిండి... ఒక కప్పు
ఉప్పు... తగినంత
నీళ్లు... సరిపడా
నూనె... రెండు టీ.
తయారీ విధానం :
మొక్కజొన్న పిండిలో నూనె, ఉప్పు, గోధుమపిండి కూడా కలిపి.. సరిపడా నీటిని పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని, చేతులతోనే రాతిమీద తడుతూ.. పలుచటి చపాతీల్లాగా ఒత్తుకోవాలి.
వీటిని ఓ మందపాటి కడాయిపైన రెండువైపులా కాల్చి తీయాలి. తీసిన తరువాత ఇష్టమైతే కొద్దిగా నెయ్యి లేదా వెన్న రాసుకుని వేడి వేడిగా ఏ కూరతో తిన్నా రుచిగా ఉంటాయి. మీరూ ట్రై చేయండి మరి..!