కావలసిన పదార్థాలు :
కరివేపాకు... ఐదు గుప్పిళ్లు
పసుపు... చిటికెడు
చింతపండు... బత్తాయి సైజంత
శెనగపిండి... రెండు టీ.
సాంబారుపొడి... రెండు టీ.
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... మూడు
నూనె... అరకప్పు
బెల్లంపొడి... రెండు టీ.
పోపు కోసం ఆవాలు... ఒక టీ.
జీలకర్ర... ఒక టీ.
ఇంగువ... చిటికెడు
తయారీ విధానం :
ఒక బాణలిలో రెండు టీస్పూన్ల నూనె పోసి కడిగిన కరివేపాకును వేసి వేయించాలి. ఆ తరువాత కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగాక, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రుబ్బిన కరివేపాకు కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
ఇందులోనే చింతపండు పులుసు పోసి, సాంబారు పొడి, పసుపు కూడా వేసి మరో పది నిమిషాలపాటు ఉడికించాలి. ఆ తరువాత శెనగపిండిని చల్లటి నీటిలో కలిపి, పై మిశ్రమంలో కలిపి మరిగించాలి. ఇష్టమైతే ఇందులో బెల్లంపొడిని కలుపుకోవచ్చు. లేదంటే లేదు. అంతే వేడి, వేడి కరివేపాకు పులుసు కూర రెడీ అయినట్లే..! ఇది అన్నంలోకి, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.