కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు.. పావు కేజీ
పనీర్ తురుము.. ఒక కప్పు
పెరుగు.. ఒక కప్పు
జీలకర్ర.. ఒక టీ.
అల్లం.. పది గ్రా.
ఉల్లిపాయలు.. రెండు
పచ్చిమిర్చి.. 4
కరివేపాకు.. రెండు రెమ్మలు
క్యాప్సికమ్ తరుగు.. ఒక కప్పు
పచ్చిబఠాణీలు.. ఒక కప్పు
పసుపు.. చిటికెడు
కారం.. ఒక టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
కాజూ పౌడర్.. రెండు టీ.
టొమోటో పేస్ట్.. ఒక కప్పు
పుదీనా.. కాస్తంత
గరంమసాలా.. ఒక టీ.
తయారీ విధానం :
ముందుగా పుట్టగొడుగుల ముక్కలను పది నిమిషాలపాటు ఉడికించి నీటిని వార్చి పక్కనుంచాలి. స్టవ్మీద పాన్ పెట్టి, తగినంత నూనె వేసి వేడయ్యాక పనీర్ ముక్కల్ని వేసి దోరగా వేయించి విడిగా ఉంచాలి. అందులోనే ఉడికించిన మష్రూమ్స్ను కూడా వేయించి పక్కనుంచాలి. అదే పాన్లో మరికాస్త నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేపాలి.
తర్వాత క్యాప్సికమ్, బటానీలు, పసుపు, అల్లం పేస్ట్.. పనీరు, పుట్టగొడుగుల ముక్కలు వేసి బాగా ప్రైచేయాలి. ఆపై కారం, ధనియాల పొడి, ఉప్పు, కాజూ పొడి.. పుదీనా, టమోటో పేస్ట్ వేసి ప్రై చేసి మూత పెట్టి 10 నిమిషాలయ్యాక గరంమసాలా కలిపి దింపేయాలి. చివర్లో కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసి చపాతీ, పూరీలతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.