Publish Date: Thu, 06 Nov 2014 (14:09 IST)
Updated Date: Thu, 06 Nov 2014 (14:20 IST)
కావలసిన పదార్థాలు:
ఉడికిన కందిపప్పు: 1/2 కప్
ధనియాలు: 1/2 కప్
మిరియాలు: 2 స్పూన్లు
ఎండు మిరపకాయలు: ఆరు
చింతపండు రసం: రెండు గ్లాసులు
నూనె, పోపు: తాలింపుకు తగినంత
టమోటా ముక్కలు: రెండు
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: 1/4 కప్
తయారు చేయండి ఇలా:
బాణలిలో నూనెను పోసి అందులో మిరియాలు, ధనియాలు, ఉడికించిన కందిపప్పులను వేయించి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ను చింతపండు రసం, కొత్తిమీర తురుములను చేర్చి కాసేపు మరిగించండి. ఉడికించిన కందిపప్పు బాబా గరిటెతో కలిపి ఈ చింతపండు రసంలో కలపండి. రసం పొంగు వచ్చాక స్టౌవ్ నుంచి దించి పోపు, కొత్తిమీర తరుగులను కలిపి దించేయండి. అంతి రుచికరమైన మైసూర్ రసం రెడీ. దీనిని భోజనం సమయంలోనే కాకుండా సాయంత్రం స్నాక్స్ తిన్న తర్వాత సూప్గా కూడా సేవించవచ్చు.
CVR
Publish Date: Thu, 06 Nov 2014 (14:09 IST)
Updated Date: Thu, 06 Nov 2014 (14:20 IST)