Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుచికరమైన మైసూర్ రసం

Advertiesment
రుచికరమైన మైసూర్ రసం
, గురువారం, 6 నవంబరు 2014 (14:09 IST)
కావలసిన పదార్థాలు: 
 
ఉడికిన కందిపప్పు: 1/2 కప్ 
ధనియాలు: 1/2 కప్
మిరియాలు: 2 స్పూన్లు 
ఎండు మిరపకాయలు: ఆరు 
చింతపండు రసం: రెండు గ్లాసులు 
నూనె, పోపు: తాలింపుకు తగినంత  
టమోటా ముక్కలు: రెండు 
ఉప్పు: తగినంత 
కొత్తిమీర తరుగు: 1/4 కప్ 
 
తయారు చేయండి ఇలా: 
బాణలిలో నూనెను పోసి అందులో మిరియాలు, ధనియాలు, ఉడికించిన కందిపప్పులను వేయించి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను చింతపండు రసం, కొత్తిమీర తురుములను చేర్చి కాసేపు మరిగించండి. ఉడికించిన కందిపప్పు బాబా గరిటెతో కలిపి ఈ చింతపండు రసంలో కలపండి. రసం పొంగు వచ్చాక స్టౌవ్ నుంచి దించి పోపు, కొత్తిమీర తరుగులను కలిపి దించేయండి. అంతి రుచికరమైన మైసూర్ రసం రెడీ. దీనిని భోజనం సమయంలోనే కాకుండా సాయంత్రం స్నాక్స్ తిన్న తర్వాత సూప్‌గా కూడా సేవించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu