కావలసిన పదార్థాలు :
వంకాయలు... 250 గ్రాములు
పచ్చి మామిడి... ఒకటి
పచ్చిమిర్చి... 30 గ్రాములు
అల్లం... చిన్న ముక్క
జీలకర్ర... అర టీస్పూను
వెలుల్లి...10 రేకలు
పసుపు... అర టీస్పూను
కొత్తిమీర... ఒక కట్ట
కరివేపాకు... 2 రెమ్మలు
ఉల్లిపాయ... ఒకటి
ధనియాలు... ఒక టీస్పూను
ఉప్పు... సరిపడా
రిఫైండ్ ఆయిల్... సరిపడా
తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిలను రుబ్బుకొని పేస్ట్లాగా చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా గాట్లు పెట్టి పేస్ట్లో వేసి ఉడకనివ్వాలి.
పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడికాయ వేసి కలపాలి. బాగా ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకుతో అలంకరించుకుని దింపేయాలి. ఈ కూర వేడి వేడి అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.