తయారీ పదార్ధాలు :
బియ్యపు పిండి : అర కప్పు
శెనగ పిండి : ఒకటిన్నర కప్పు
ఉల్లిముక్కలు : రెండు కప్పులు
పచ్చిమిర్చి : చెంచాడు ముక్కలు
నూనె : వేపటానికి అవసరమైనంత
అల్లంవెల్లుల్లి గుజ్జు : అర చెంచా
కారం : అర చెంచా
కరివేపాకు : కావలిసినంత
తయారీ విధానం :
పొయ్యిమీద బాండీ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. మరో గిన్నెలోకి ఉల్లిముక్కలు, అల్లం-వెల్లుల్లి గుజ్జు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు మిశ్రమంగా కలపాలి.
ఈ మిశ్రమానికి శెనగపిండి కలిపి అవసరమైనంత నీరు పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో కొద్దిగా పిండి వేసి ఎరడాగా వేగిన తర్వాత దించుకోవాలి. దీనితో మసాలా ఉల్లి పకోడీ సిద్దం.