కావలసిన పదార్థాలు :
మష్రూమ్స్ (పుట్టగొడుగులు)... అరకేజీ
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిరపకాయలు... ఆరు
మిరియాలు... ఒక టీస్పూన్
నూనె... నాలుగు టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్... ఒక టీస్పూన్
పసుపు... అర టీస్పూన్
క్రీమ్... ఒక టీస్పూన్
నిమ్మరసం... రెండు టీస్పూన్లు
కొత్తిమీర పొడి... ఒక టీస్పూన్
కరివేపాకు పొడి... ఒక టీస్పూన్
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
ముందుగా ఉప్పు కలిపిన వేడి నీటిలో మష్రూమ్స్ను అరగంటపాటు నానబెట్టాలి. నూనెను వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు నిమిషాలు వేయించాలి.
తరువాత మష్రూమ్స్, మిరియాలు, పసుపు, కొత్తిమీర పొడి, కరివేపాకు పొడి వేయాలి. కొద్దిసేపటి తరువాత ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టాలి. అలా పదినిమిషాలు ఉడికిన తరువాత మంట తగ్గించి... క్రీం, నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరువాత దించేయాలి. అంతే వేడి వేడి మష్రూమ్స్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్లే...! దీన్ని రోటీలతో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.