పసందైన ఇడ్లీ చట్నీ "శెనగప్పు-బఠాణీ"
కావలసిన పదార్థాలు :శెనగపప్పు.. వంద గ్రా.ఎండుబఠాణీలు.. వంద గ్రా.పచ్చిమిర్చి.. పదిజీలకర్ర.. ఒక టీ.ధనియాలు.. ఒక టీ.ఉల్లిపాయ.. ఒకటిచింతపండు.. 50 గ్రా.పంచదార.. ఒక టీ.కొత్తిమీర.. ఒక కట్టఉప్పు.. తగినంతతాలింపు కోసం...జీలకర్ర.. అర టీ.ఆవాలు.. అర టీ.వెల్లుల్లి రేకలు.. ఆరుకరివేపాకు.. కాస్తనూనె.. రెండు టీ.తయారీ విధానం :ఎండుబఠాణీల్ని ఓ పూట నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వేగాక పచ్చి శెనగపప్పు, నానబెట్టిన బఠాణీలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి నూనెలో కొద్దిగా వేయించి తీయాలి. చల్లారాక ఉప్పు, చింతపండు, కొత్తిమీరతోపాటు వేయించినవాటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తాలింపు కోసం చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేయించి పచ్చడిలో కలుపుకుంటే.. శెనగపప్పు-బఠాణీ సిద్ధమైనట్లే..! దీనిని వేడి వేడి ఇడ్లీలతో నంజుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.