కావలసిన పదార్థాలు :
పనీర్... పావు కేజీ
మినుములు.. ఒక కప్పు
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
ధనియాలపొడి, కారంపొడి... చెరో టీ.
టమోటోలు... రెండు
గరంమసాలా... చిటికెడు
అల్లం.. కాస్తంత
అల్లంవెల్లుల్లి ముద్ద... అర టీ.
పాలక్రీం... 50 ఎం.ఎల్.
నూనె... వంద ఎం.ఎల్.
తయారీ విధానం :
పనీర్ను ముక్కలుగా కోసి, కాసిన్ని నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించి దించాలి. మినుములు నానబెట్టి కొంచెం ఉప్పు, దంచిన అల్లం కలిపి ఉడికించాలి. ఓ గిన్నెలో నూనె పోసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాలపొడి, కారం వేయాలి.
మిక్సీలో గుజ్జులా చేసిన టొమాటోల్ని కూడా పై పాత్రలో వేసి ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన మినుముల్ని కూడా వేయాలి. తరువాత నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. చివరగా పాలక్రీం కలిపి, ఉడికించిన పనీర్ముక్కలు వేసి అల్లం ముక్కలతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. అంతే దాల్ అమృత్సర్ పనీర్ సిద్ధమైనట్లే..!