కావలసిన పదార్థాలు :
నూనె-1/2 కప్పు
ఆవాలు-1/2 చెంచా
పచ్చిమిర్చి-5 కాయలు
ఉప్పు-తగినంత
ఇంగువ- 1/2 చెంచా
కొత్తిమీర- 450 గ్రాములు
కొబ్బరి తురుము- 250 గ్రాములు
జీలకర్ర- 1/2 చెంచా
మిర్చి- 2
పసుపు- కాస్త
కరివేపాకు- 1 రెమ్మ ఆకులు
పంచదార- 4 చెంచాలు
పుదీన- 1/2 ఆకులు
నిమ్మకాయలు- 4 కాయలు
తయారీ విధానం :
ముందుగా బాణలి పెట్టి నూనె వేసి బాగా కాగనివ్వాలి. కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేపాలి. వీటికి కొబ్బరి తురుము కలిపి బాగా మగ్గించి వేపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. చల్లార్చిన మిశ్రమానికి కొత్తిమీర, పుదీన, పంచదార, ఉప్పు సరిపడ, పసుపు జత చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. చట్నీని బౌల్ లోకి తీసి నిమ్మరసం కలిపి ఉప్పు సరిచూసుకుని వేడి వేడి సమోసా, కబాబ్స్ లాంటి వాటిలోకి ఈ చట్నీని సర్వ్ చేయండి ఆంతే ధనియా చట్నీ రెడీ.