దాయాదుల వంటకం "కరాచి పుణుకులు"
కావలసిన పదార్థాలు :ఉప్మారవ్వ.. పావు కేజీమైదాపిండి... 150 గ్రా.మినపపిండి... ఒక కప్పుఉల్లిపాయలు.. నాలుగుపచ్చిమిర్చి.. ఆరుకొత్తిమీర... 2 కట్టలువంటసోడా.. చిటికెడుఉప్పు... తగినంతనూనె.. సరిపడాతయారీ విధానం :ఓ గిన్నెలో మినప్పిండి వేసి అందులోనే రవ్వ, మైదాపిండి, వంటసోడా వేసి నీళ్లు చేర్చి జారుగా కలిపి 3 గంటలపాటు పులియనివ్వాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి.ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగాచేసి కాగుతున్న నూనెలో వేసి.. ఎర్రగా వేయించి తీయాలి. వీటిని ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి. అంతే మన దాయాదులైన పాకిస్థానీయులు ఇష్టంగా తినే కరాచీ పుణుకులు తయార్...!