కావలసిన పదార్థాలు :
గుమ్మడి గింజలు... ఒక కప్పు
కందిపప్పు... అరకప్పు
పచ్చికొబ్బరి తురుము... ఒక కప్పు
గరంమసాలా... ఒక టీస్పూను
ఉప్పు, కారం... రుచికి తగినంత
పెద్ద ఉల్లి... ఒకటి
టమాటాలు... రెండు
పచ్చిమిరపకాయలు... రెండు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ... సరిపడా
తయారీ విధానం :
ముందుగా గుమ్మడి గింజలని, పప్పును ఉడికించాలి. ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు వేసి ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి. పుదీనా, కరివేపాకు, గింజలు, పప్పు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. చివర్లో టమోటో కూడా వేసి వేయించి, కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవీలా తయారు చేయాలి. బాగా ఉడికిన తరువాత దించి గరంమసాలా, కొత్తిమీర, మీగడ కలిపి వడ్డించాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి బాగుంటుంది.