కావలసిన వస్తువులు :
బియ్యం : 400 గ్రాములు
నూనె : 4 టేబుల్ స్పూన్లు
ఆవాలు : పావు టీస్పూను
జీలకర్ర : పావు టీస్పూను
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
క్యాప్సికం ముక్కలు : కప్పు
తురిమిన క్యారెట్ : కప్పు
కరివేపాకు : 2 రెమ్మలు
నిమ్మరసం : టీస్పూను
కొత్తిమీర : కొద్దిగా
పప్పుల పొడి : టీస్పూన్
ముందుగా ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, కొద్దిగా ఇంగువ, దనియాలు వేయించి పొడి కొట్టి ఉంచుకోండి.
ఇలా చెయ్యండి :
బియ్యాన్ని కడిగి కాసేపు నానబెట్టండి. తరువాత తగినంత ఉప్పు, నీళ్లు పోసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండి లోతుగా ఉన్న పాన్లో నూనె వేడిచేసి, ఆవాలు వేయాలి. అవి చిటపటమన్న తరువాత జీలకర్ర, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, తురిమిన క్యారెట్, కరివేపాకు, అన్నీ వేసి బాగా కలపండి. మూత పెట్టి మామూలు సెగమీద రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం మూత తీసి ఓసారి గరిటెతో తిప్పాలి.
ఇప్పుడు పప్పులపొడి, ఉప్పు వేసి ఓసారి తిప్పి, ఈ మొత్తం మిశ్రమాన్ని వండి ఉంచిన అన్నంలో కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర చల్లితే రుచికరమైన రైస్ వెరైటీ రెడీ. దీన్ని పెరుగులో కూరగాయల ముక్కలన్నీ కలిపి చేసిన సలాడ్తో తింటే బాగుంటుంది.