కావలసిన పదార్థాలు :
ఆలు - పావు కేజీ కంటే కాస్త ఎక్కువ, గోధుమ పిండి - రెండున్నర కప్పులు, కర్వేపాకు - కాస్త, గరం మసాలా పొడి - అర చెంచా, ఉప్పు - తగినంత, కారం - చెంచా, నూనె - సరిపడ.
తయారు చేయు విధానం :
ముందుగా ఆలును శుభ్రంగా కడిగి తోలు తీసి కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకోవాలి. దీనిని చేత్తో మెత్తగా చేసి ఉప్పు, కారం, మసాలా పొడి, కర్వేపాకులను వేసి కలపాలి. మరో వైపు గోధుమ పిండిని నీళ్లు తక్కువగా పోసి కలిపి పెట్టుకోవాలి. పిండి నాననివ్వకుండా గుండ్రంగా ఒత్తి పెనం కాలవేసి దానిపై నూనెతో రెండు వైపులో కాల్చాలి.