కావలసిన పదార్థాలు :
అరటికాయలు... మూడు
పచ్చిమామిడి... రెండు
ఉల్లిపాయ... ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్... ఒక టీస్పూను
పోపు దినుసులు... అర టీస్పూను
మిర్చి పొడి... రెండు టీస్పూన్లు
ధనియాల పొడి... అర టీస్పూను
గరం మసాలా... పావు టీస్పూను
సన్నగా తరిగిన పచ్చిమిర్చి... పది
పసుపు... అర టీస్పూను
కొత్తిమీర... 2 కట్టలు
కరివేపాకు... 2 రెమ్మలు
రిఫైండ్ ఆయిల్... సరిపడినంత
తయారీ విధానం :
ముందుగా అరటికాయను కొద్ది సేపు వేడి నీళ్ళలో ఉడికించి, పైతోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి, వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించి ఆ తరువాత... ఉల్లి పాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగనివ్వాలి.
అరటికాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిర్చిపొడి, ఉప్పు, ధనియాల పొడి, మామిడి ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు సన్నని సెగపై ఉడికించి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. నీళ్ళు చిక్కబడ్డాక గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వరసగా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇది వేడి వేడి అన్నంతో తింటే బాగుంటుంది.