Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతిమూత్ర వ్యాధికి "నువ్వుల పచ్చడి"తో బై..బై..!

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
నువ్వులు.. 150 గ్రా.
పచ్చిమిర్చి.. ఎనిమిది
చింతపండు.. 50 గ్రా.
వెల్లుల్లి రెబ్బలు.. పదిహేను
ఉప్పు.. తగినంత

తాలింపు కోసం..
ఎండుమిర్చి.. 4
ఆవాలు.. ఒక టీ.
జీలకర్ర.. ఒక టీ.
కరివేపాకు.. 20 రెమ్మలు
నూనె.. తగినంత

తయారీ విధానం :
చింతపండుని అరకప్పు నీళ్లలో వేసి 15 నిమిషాలు నానబెట్టి, గింజలు తీసేసి గుజ్జులా చేసుకోవాలి. బాణలిలో నువ్వులు వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. పచ్చిమిర్చిని నేరుగా గ్యాస్‌మంట లేదా బొగ్గులమీద కాల్చాలి. కాల్చిన మిర్చి, వేయించిన నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, చింతపండుగుజ్జు అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి.

బాణలిలో నూనె వేసి తాలింపు కోసం చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా వేయించి పచ్చడిలో కలపాలి. అంతే నువ్వుల పచ్చడి తయార్..! ఇది దోశె, ఇడ్లీ, చపాతీలలోకి చాలా రుచిగా ఉంటుంది. ఆహారం జీర్ణంకాక కడుపునొప్పి, పులిత్రేన్పులు, అతిమూత్రవ్యాధి, అజీర్తి, విరేచనాలు, మలబద్ధకం లాంటి సమస్యల నుంచి బయటపడేందుకు నువ్వులు, నువ్వుల నూనె బాగా సహకరిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu