Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడుము నొప్పితో బాధపడుతున్నారా..!?

నడుము నొప్పితో బాధపడుతున్నారా..!?
, మంగళవారం, 12 జనవరి 2016 (12:01 IST)
సాధారణంగా మహిళలను వేధించే సమస్య నడుము నొప్పి. ఆధునిక యుగంలో మహిళలు ఇటు గృహంలోనూ, అటు బయటి ప్రపంచంలోనూ పలు రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, కాసేపు తీరిక దొరికి కూర్చుంటే హమ్మా నడుము నొప్పి అంటారు. 
 
అలా మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. నల్లమందు రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే సొంఠి గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu