Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపిల్, ద్రాక్ష, జామ, బొప్పాయి పండ్లు తింటే లాభాలు ఏమిటి...?

Advertiesment
gouva
ప్రకృతి ప్రాసాదించిన పండ్లు విరివిగా తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో అనేక ఔషధ గుణాలు దాగివున్నాయని న్యూట్రీషియన్లు చెపుతుంటారు. మనం రోజు తీసుకుంటున్న పండ్లతోనే అనేక వ్యాధులను అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. 
 
ఆపిల్ : రక్తహీనత, సక్రమ రక్తప్రసరణ, మెదడుకు మేలు చేస్తుంది. పేగులోని క్రిములను నశింపజేస్తుంది. కిడ్నీ సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. ఇంకా హృద్రోగ రోగులకు ఆపిల్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మోకాలి నొప్పి, నడుము నొప్పి, నరాలకు సంబంధించి వ్యాధుల్ని దూరం చేసుకోవాలంటే రోజుకో ఆపిల్ పండు తీసుకుంటే సరిపోతుంది.  
 
ద్రాక్ష పండ్లు : ఏడాది చిన్నారులకు జ్వరం, జలుబు, మలబద్ధకం ఏర్పడితే ద్రాక్ష పండ్లను పిండి ఒక స్పూన్ ఆ రసాన్ని ఇస్తే సరిపోతుంది. హృద్రోగ వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. ఎముకల్ని పటిష్ట పరుస్తుంది.  
 
జామపండు : వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. అందాన్ని పెంచడంతో పాటు శరీర కాంతికి, ఎముకల బలానికి మందుగా పనిచేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. కాలేయ సమస్యల్ని దూరం చేసి వ్యాధినిరోధక శక్తిని పెంచి.. అల్సర్‌ను నయం చేస్తుంది.  
 
బొప్పాయి : బొప్పాయి పండును అప్పుడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడి, దంతాలు పటిష్టమవుతాయి. నరాల బలహీనత తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu